nithin: మహేశ్ బాబు చేతుల మీదుగా 'శ్రీనివాస కళ్యాణం' ట్రైలర్ రిలీజ్

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'శ్రీనివాస కళ్యాణం'
  • వివిధ పాత్రలలో 70 మంది ఆర్టిస్టులు 
  • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల  

దిల్ రాజు నిర్మాతగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రూపొందింది. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేశ్ బాబు చేతుల మీదుగా రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో 70 మంది ఆర్టిస్టులు నటించడం విశేషం. నందిత శ్వేత మరో కథానాయికగా నటిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. రాజేంద్రప్రసాద్ .. ఆమని .. సీనియర్ నరేశ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి .. పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకం అందరిలోను కనిపిస్తోంది.  

More Telugu News