sensex: వరుసగా నాలుగోరోజు లాభాలు.. రికార్డు స్థాయిలో ముగిసిన మార్కెట్లు

  • ఆల్ టైమ్ హైలో ముగిసిన మార్కెట్లు
  • 37,607కు చేరిన సెన్సెక్స్
  • 19 శాతానికి పైగా లాభపడ్డ హెచ్డీఐఎల్

సానుకూలంగా వెలువడుతున్న వివిధ సంస్థల త్రైమాసిక ఫలితాలు, రేపటి ఆర్బీఐ పాలసీ సమావేశం నేపథ్యంలో ఈ రోజు కూడా మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 112 పాయింట్లు లాభపడి 37,607కు చేరుకుంది.నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 11,357 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఐఎల్ (19.65%), బీఎఫ్ యుటిలిటీస్ (9.01%), అదానీ పవర్ (7.92%), భారత్ ఎలక్ట్రానిక్స్ (7.76%), డాబర్ ఇండియా (6.96%).    

టాప్ లూజర్స్:
రెడింగ్టన్ ఇండియా (-12.48%), బ్యాంక్ ఆఫ్ ఇండియా (-8.75%), క్యాన్ ఫిన్ హోమ్స్ (-7.82%), ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (-7.49%), ఐడియా సెల్యులార్ (-6.07%).      

More Telugu News