prabhas: 'సాహో' కోసం హైదరాబాద్ వచ్చిన శ్రద్ధా కపూర్

  • దుబాయ్ లో పూర్తయిన మేజర్ షెడ్యూల్ 
  • హైదరాబాద్ లో మొదలైన తాజా షెడ్యూల్ 
  • ప్రధాన పాత్రల కాంబినేషన్లో చిత్రీకరణ

ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమాను నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ను దుబాయ్ లో పూర్తి చేశారు. ఒకటి రెండు పాటలను .. భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. కొన్ని రోజుల పాటు విరామం తీసుకున్న ఈ సినిమా టీమ్, తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసింది.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఈ రోజు నుంచి మొదలవుతోన్న ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి శ్రద్ధా కపూర్ కూడా వచ్చింది. శ్రద్ధా కపూర్ కి తెలుగులో ఇది తొలి సినిమా. తొలి సినిమాతోనే ప్రభాస్ వంటి స్టార్ హీరో జోడీగా ఛాన్స్ దొరికినందుకు సంతోషపడిపోతోన్న శ్రద్ధా కపూర్, ఈ సినిమా తన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని భావిస్తోంది.      

More Telugu News