rwanda: రువాండా లోని ఆదర్శ గ్రామాన్ని సందర్శించి, గోవులను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోదీ!

  • రువాండా దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీ
  • పేదరిక నిర్మూలన కోసం 'గిరింకా' అనే పథకాన్ని అమలు చేస్తోన్న రువాండా  
  • రెండు రోజుల పాటు మోదీ పర్యటన 

ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా రువాండా చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశంలోని రువేరు ఆదర్శ గ్రామాన్ని సందర్శించి 200 గోవులను బహుమతిగా ఇచ్చారు. పేదరిక నిర్మూలన కోసం 2006లో రువాండా గవర్నమెంట్ 'గిరింకా' అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. పేద ప్రజలకి గోవులను బహుమతిగా అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకంలో భాగంగానే ప్రధాని మోదీ ఆ దేశ ప్రజలకి గోవులను కానుకగా ఇచ్చారు. కాగా, రువాండా దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించిన మోదీ, ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు.

More Telugu News