nithin: నితిన్ మా ఇంటికొచ్చి మరీ అడిగాడు: దిల్ రాజు

  • 'దిల్' సినిమా చేసి 15 యేళ్లు అయింది 
  • ఆ తరువాత నితిన్ కి వరుస ప్లాపులు వచ్చాయి 
  • రాశి ఖన్నా విషయంలో దర్శకుడు సంశయించాడు  

'దిల్' రాజు నిర్మాతగా .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' రూపొందింది. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఆగస్టు 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ఆడియో వేడుక వైభవంగా జరిగింది. ఈ వేదికపై 'దిల్' రాజు మాట్లాడుతూ .. " 'దిల్' తరువాత 15 సంవత్సరాలకి నితిన్ తో చేసిన సినిమా ఇది"అన్నారు. 'దిల్' తరువాత ఒకానొక సమయంలో నితిన్ కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక రోజున నేరుగా మా ఇంటికి వచ్చేశాడు .. తనతో ఒక సినిమా చేయమని అడిగాడు. నేను కూడా నా వంతు ప్రయత్నం చేశాను .. కానీ కుదరలేదు. 'శ్రీనివాస కళ్యాణం' వంటి ఒక మంచి సినిమాను చేయాలని రాసిపెట్టి వుంది కనుకనే, ఈ సినిమాకి ముందు మరో సినిమా చేయలేకపోయాము. ఇక రాశి ఖన్నా విషయానికి వస్తే .. ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ అని చెప్పగానే దర్శకుడు సతీశ్ వేగేశ్న సంశయించారు. 'తొలిప్రేమ'కి ముందున్న రాశి ఖన్నా వేరు .. ఇప్పుడున్న రాశి ఖన్నా వేరు అని చెప్పేసి ఆయనను ఒప్పించాను" అని చెప్పుకొచ్చారు.     

More Telugu News