Vijayawada: మందుబాబుల కోసం బెజవాడ దిగ్బంధం... పట్టుబడ్డ 170 మంది!

  • రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకూ తనిఖీలు
  • 126 బైకులు, 17 కార్లు, 6 లారీలు సీజ్
  • పట్టుబడిన వారిలో మహిళలు కూడా

నిన్న రాత్రి విజయవాడ పోలీసులు మందు తాగి వాహనాలు నడిపేవారిపై కొరడా ఝళిపించారు. నగరంలోని పలు ప్రాంతాలను దిగ్బంధించిన పోలీసులు, రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఆటోనగర్, బెంజ్ సర్కిల్, బీసెంట్ రోడ్, భవానీపురం తదితర 8 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు మొత్తం 170 మంది తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. 126 బైకులు, 17 కార్లు, 6 లారీలను నడుపుతున్న మందుబాబులను గుర్తించామని, వారి వాహనాలను సీజ్ చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు. వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు.

More Telugu News