Telangana: మంత్రి కేటీఆర్ ని కలిసిన మలయాళ నటుడు మమ్ముట్టి!

  • క్యాంప్ కార్యాలయంలో కేటీఆర్ ని కలిసిన మమ్ముట్టి 
  • చీఫ్ గెస్ట్ గా రావాలని కేటీఆర్ కి ఆహ్వానం
  • ప్రస్తుతం వైస్సార్ బయోపిక్ లో నటిస్తోన్న మమ్ముట్టి 

తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మలయాళ నటుడు మమ్ముట్టి ఈరోజు కలిశారు. ఈనెల 25న హైదరాబాద్ లో జరగనున్న 'కైరాలి పీపుల్ ఇన్నొటెక్ అవార్డ్స్' కార్యక్రమానికి కేటీఆర్ ని చీఫ్ గెస్ట్ గా రావాలని ఈ సందర్భంగా మమ్ముట్టి ఆహ్వానించారు. ఈ మేరకు వారిద్దరూ కార్యాలయంలో కలిసిన ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, మమ్ముట్టి ప్రస్తుతం దివంగత నేత వైఎస్ఆర్ బయోపిక్ చేస్తున్నారు.

More Telugu News