dhoni: టీమిండియా కెప్టెన్ ధోనీట.. బీసీసీఐపై మండిపడుతున్న నెటిజన్లు!

  • టీమిండియా ప్లేయర్ల బయోడేటాలో బీసీసీఐ పొరపాటు 
  • కెప్టెన్ కోహ్లీ గురించి ఎటువంటి వివరణ లేని వైనం
  • ఆ పోస్ట్ లను స్క్రీన్ షాట్లు తీసిన నెటిజన్లు

టీమిండియా బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనినీ బీసీసీఐ మరోసారి కెప్టెన్ గా చేసింది. టీమిండియా కెప్టెన్ ధోనీ అని బీసీసీఐ పొరపాటుగా తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొనడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. బీసీసీఐ పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా ప్లేయర్ల బయోడేటాలో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎటువంటి వివరణ లేకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బీసీసీఐ చేసిన పొరపాటును నెటిజన్లు స్క్రీన్ షాట్ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గమనార్హం. కాగా, బీసీసీఐ పొరపాటున ఇలా ప్రకటించిందా? లేక కెప్టెన్సీ పగ్గాలను ధోనీకి నిజంగానే అప్పగించిందా! అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

More Telugu News