ramaprabha: శరత్ బాబుతో అలా పరిచయం ఏర్పడింది: రమాప్రభ

  • 'పట్నం వచ్చిన పతివ్రతలు' చేస్తున్నాను 
  • అరుణాచలం స్టూడియోలో షూటింగ్
  • శరత్ బాబు అక్కడికి వచ్చాడు

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రమాప్రభ మాట్లాడుతూ ఉండగా, ఆమె మాజీ భర్త శరత్ బాబు ప్రస్తావన వచ్చింది. అప్పుడు రమాప్రభ స్పందిస్తూ "చిరంజీవి .. మోహన్ బాబు .. రాధిక .. గీతలతో 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా వచ్చింది .. ఆ సినిమాలో నాది మంచి పాత్ర.  ఆ సినిమా షూటింగు చెన్నయ్, అరుణాచలం స్టూడియోలో జరుగుతుండగా, 'కన్నెవయసు' హీరో లక్ష్మికాంత్ తో కలిసి శరత్ బాబు అక్కడికి వచ్చాడు. లక్ష్మీకాంత్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో ఆయన ద్వారా శరత్ బాబుతో పరిచయం ఏర్పడింది.

అయితే జరిగిన దాంట్లో శరత్ బాబుది తప్పు అని చెప్పడానికి లేదు .. అది అలా జరగవలసి వుంది .. జరిగిపోయింది అంతే. ఈ విషయంలో ఆయన వైపు నుంచి ఆయన ఏం చెప్పుకుంటాడనేది ఆయన సంస్కారం. మేం ఇద్దరం ఎవరికి  ఏం చెప్పినా, నన్ను అభిమానించే వాళ్లు నాది కరెక్ట్ అంటారు. ఆయనని ఇష్టపడే వాళ్లు ఆయనది కరెక్ట్ అంటారు. ఎవరెవరో ఏదేదో ఊహించుకుని చెప్పుకుంటారు గానీ, మా ఇద్దరికి ఎలాంటి గొడవా లేదు .. ఒకవేళ ఏదైనా వుంటే చెప్పడానికి సంకోచించను" అన్నారు. 

More Telugu News