tulasi reddy: టీడీపీతో పొత్తు అంశంపై తులసిరెడ్డి స్పందన!

  • టీడీపీతో పొత్తు అవాస్తవం
  • టీడీపీ, వైసీపీల విధానాలు ఒకటే
  • ఎన్నికల తర్వాత ఈ పార్టీలు బీజేపీ పంచన చేరుతాయి

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దగ్గరవుతున్నాయని... రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి స్పందించారు. టీడీపీతో పొత్తు గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని చెప్పారు.

టీడీపీ, వైసీపీల విధానాలు ఒకటేనని ఆయన అన్నారు. బీజేపీకి టీడీపీ అధికారిక మిత్రపక్షమైతే, వైసీపీ అనధికార మిత్రపక్షమని చెప్పారు. ఎన్నికల కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు బీజేపీ పంచన చేరుతాయని చెప్పారు. టీడీపీ తన పేరును 'తెలుగు ద్రోహుల పార్టీ'గా మార్చుకోవాలని సూచించారు. నకిలీ, కబ్జాకోరు పార్టీ వైసీపీ అని విమర్శించారు.

More Telugu News