Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఎన్టీఆర్' బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్ 
  • ఇంద్రగంటి మల్టీస్టారర్ లో ఇద్దరు హీరోలు 
  • రామోజీ ఫిలిం సిటీలో 'అరవింద సమేత'
  • అమెరికా పయనమైన మెగా హీరో! 

*  ప్రఖ్యాత నటుడు ఎన్టీ రామారావు బయోపిక్ గా రూపొందుతున్న 'ఎన్టీఆర్' సినిమాలో నటించే తారాగణం అంతకంతకు పెరిగిపోతోంది. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం తాజగా చిత్రం యూనిట్ రకుల్ ప్రీతి సింగ్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.
*  తాజాగా 'సమ్మోహనం' హిట్టును తన ఖాతాలో వేసుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ మల్టీ స్టారర్ నిర్మిస్తున్న సంగతి విదితమే. ఇందులో నాని, శర్వానంద్ నటించే అవకాశం వుందని సమాచారం. ప్రస్తుతం వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం తాజా షెడ్యూలు ఈ నెల 16 నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. దీని తర్వాత మరో షెడ్యూల్ కోసం యూనిట్ పొల్లాచ్చి వెళుతుంది.
*  వరుసగా అపజయాలను ఎదుర్కుంటున్న మెగా హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుతం అమెరికా ప్రయాణంలో వున్నాడు. తన తదుపరి చిత్రం కోసం తన లుక్కును అక్కడ పూర్తిగా మార్చుకుంటాడు. త్వరలోనే కొత్త మేకోవర్ తో తిరిగొచ్చి, కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తాడు.

More Telugu News