‘ముందస్తు’పై మనసు మార్చుకున్న మోదీ?
- ‘ముందస్తు’పై పునరాలోచనలో కేంద్రం
- షెడ్యూలు ప్రకారమే లోక్సభ ఎన్నికలు
- ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే కారణం?
నిజానికి ఈ ఏడాది డిసెంబరులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితోపాటు లోక్సభ ఎన్నికలు కూడా జరిపించేస్తే ఓ పనైపోతుందని మోదీ సర్కారు భావించింది. తద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీపై వ్యతిరేకత మరింత పెరగకుండా చూడడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని భావించింది. అయితే, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు మినహా మెజారిటీ పార్టీలు జమిలి ఎన్నికలకు 'నో' చెప్పాయి. ఈ కారణంగానే కేంద్రం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న పలు సర్వేల ఫలితాలు కూడా మోదీ మనసు మార్చుకోవడానికి మరో కారణమైందని చెబుతున్నారు.