kenya: టీ20 మ్యాచ్‌లో 270 పరుగులు చేసిన కెన్యా.. అయినా ప్రపంచ రికార్డు మిస్!

  • వాండాతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన కెన్యా ఆటగాళ్లు
  • నలుగురు అర్థ సెంచరీలు.. 20 సిక్సర్లు
  • టీ20ల్లో అత్యధిక స్కోరు

క్రికెట్ పసికూనగా చెప్పుకునే కెన్యా టీ20ల్లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును నెలకొల్పింది. అయితే, ఇది అధికారిక మ్యాచ్ కాకపోవడంతో రికార్డుల్లో నమోదు కాలేదు. వరల్డ్ టీ20 క్వాలిఫయింగ్ మ్యా‌చ్‌లో భాగంగా కిర్గిలిలోని గహంగా క్రికెట్ స్టేడియంలో వాండా జట్టుతో మ్యాచ్ జరిగింది. ఈ ‌మ్యాచ్‌లో కెన్యా బ్యాట్స్‌మన్లు రెచ్చిపోయారు. బ్యాట్‌తో వీరవిజృంభణ చేశారు. ఏకంగా నలుగురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు నమోదు చేయగా, మొత్తం 20 సిక్సర్లు బాదారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయిన కెన్యా 270 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ఐసీసీ అధికారిక గుర్తింపు లేకపోవడంతో ఇది రికార్డులకెక్కలేదు.

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2013లో 263 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. 2016లో ఆస్ట్రేలియా జట్టు కూడా టీ20 మ్యాచ్‌లో 263 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు. కెన్యా మ్యాచ్‌ను ఐసీసీ గుర్తించి ఉంటే కనుక ఈ రికార్డులు బద్దలై ఉండేవి.

More Telugu News