manchu lakshmi: భయానక పరిస్థితులను ఎదుర్కొనే 'దీక్ష' పాత్రలో మంచు లక్ష్మి

  • మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా 'వైఫ్ ఆఫ్ రామ్'
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 
  • ఈ నెల 20వ తేదీన విడుదల  

మంచు లక్ష్మి ప్రధానమైన పాత్రగా .. విజయ్ యలకంటి దర్శకత్వంలో 'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా రూపొందింది. ఇది ఒక సైకలాజికల్ ఇంటలిజెంట్ థ్రిల్లర్ గా నిర్మితమైంది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన రాజమౌళి ప్రశంసించడంతో, ఈ సినిమాపై అందరిలోను మరింతగా ఆసక్తి పెరుగుతోంది.

ఈ సినిమాలో మంచు లక్ష్మి 'దీక్ష' అనే పాత్రలో కనిపించనుంది. కొన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో దీక్ష భర్త మరణిస్తాడు. అందుకు కారణమెవరనే విషయాన్ని కనుక్కోవడానికి ఆమె రంగంలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఆమెకి ఎదురయ్యే భయానక పరిస్థితులు ఉత్కంఠను రేకెత్తిస్తాయట. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా,యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మంచు లక్ష్మి కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.         

More Telugu News