kanna: చంద్రబాబు రాక్షస పాలనకు ఈ సంఘటనే నిదర్శనం!: కన్నా

  • నాపై జరిగిన చెప్పుల దాడిని ఖండిస్తున్నా
  • కేంద్రం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారు
  • అందుకే, మాపై రాష్ట్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది

నెల్లూరు జిల్లా కావలిలో తనపై చెప్పుతో దాడి చేయడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నాపై జరిగిన చెప్పుల దాడిని ఖండిస్తున్నా. చంద్రబాబు రాక్షస పాలనకు ఈ సంఘటనే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాపై రాష్ట్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది’ అని విమర్శించారు.

కాగా, కన్నాపై జరిగిన దాడిపై బీజేపీ యువ మోర్చా నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అన్నింటా విఫలమైందని, అందుకే, ఆ పార్టీ వాళ్లు తమపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 

More Telugu News