యాదగిరి గుట్ట పనులను వేగంగా పూర్తి చేయాలి: తెలంగాణ సీఎస్
- దేవాలయ పరిధిలో కాటేజీలు, విల్లాలు, ప్లాట్ల నిర్మాణం
- రాయగిరి గండి ఇరిగేషన్ చెరువుల సుందరీకరణ
- రాయగిరి వద్ద ఆర్ఓబీ నిర్మాణం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తికావాలన్నారు. వేద పాఠశాల నిర్మాణానికి అవసరమైన చోట ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.