janasena: విశాఖలో జనసేన నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • సీతమ్మధారలో కొత్త కార్యాలయం
  • ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుకు పాలకుల నిర్లక్ష్యమే కారణం
  • నూతన కార్యాలయం ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని పవన్ ఆకాంక్ష

విశాఖపట్నంలోని సీతమ్మధారలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి నూతన కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు. ‘‘అన్ని వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం. దీనికి కారణాలను అన్వేషించడంతోపాటు ఈ ప్రాంత సమస్యలకు పరిష్కారాలు సూచించి, అభివృద్ధికి బాటలు వేసేందుకు ఈ కార్యాలయం వేదిక కావాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్రంలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమై చర్చలు నిర్వహించారు. ఈ వివరాలను పార్టీ మీడియా విభాగం హెడ్ పి.హరిప్రసాద్ వెల్లడించారు.

More Telugu News