koti: కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో.. ఆరు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన మహిళ

  • ఆసుపత్రి సిబ్బంది నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు
  • సీసీటీవీ దృశ్యాల పరిశీలన
  • గాలించేందుకు 6 బృందాల ఏర్పాటు
  • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా గాలింపు

హైదరాబాద్‌లోని కోఠి సుల్తాన్ బజార్‌లో ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓ గుర్తు తెలియని మహిళ ఆరు రోజుల ఆడ శిశువును ఎత్తుకెళ్లింది. ఆసుపత్రి సిబ్బంది నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే, అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ కోసం గాలించేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ అనే మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చి, ఆమె కదల్లేని స్థితిలో ఆసుపత్రిలో ఉంటోంది. ఆమె వద్దకు వచ్చిన ఓ మహిళ శిశువుకు టీకా ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, తిరిగి రాలేదు.   

More Telugu News