దర్శకుడి భార్యను ఎవరు చంపారన్న కథాంశంతో రూపొందిన 'ఆటగాళ్లు'!
- నారా రోహిత్, జగపతిబాబు నటించిన మల్టీస్టారర్
- థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన 'ఆటగాళ్లు'
- ప్రేక్షకులకు నచ్చుతుందన్న జగపతిబాబు
విలక్షణ నటుడు జగపతిబాబు, నారా రోహిత్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం. దీనికి పరుచూరు మురళి దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని శేఖర్ కమ్ముల విడుదల చేయగా, జగపతిబాబు మాట్లాడుతూ, ఈ చిత్రం ఓ థ్రిల్లర్ కథాంశమని, హత్య చుట్టూ తిరుగుతుందని, దర్శకుడి భార్యను ఎవరు చంపారన్న కథ ప్రేక్షకులను కట్టి పడేస్తుందని చెప్పాడు. మరి అసలు విషయం తెలియాలంటే, సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.