East Godavari District: ప్రియురాలి భర్తను హత్య చేసిన యువకుడు!

  • తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
  • పది రోజుల క్రితం సత్తిబాబు అదృశ్యం
  • నిజాన్ని రాబట్టిన పోలీసులు

తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం ముక్కొల్లులో పది రోజుల క్రితం సత్తిబాబు అనే యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి గురించి గాలించిన పోలీసులకు పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో మృతదేహం లభించింది.

సత్తిబాబుని పది రోజుల క్రితం హత్య చేశారని గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసులో నిజాలను రాబట్టారు. సత్తిబాబు భార్య ప్రియుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రియురాలి ప్రోత్సాహంతోనే ఆ యువకుడు ఈ హత్య చేశాడా? అన్న విషయం తెలియాల్సి ఉంది.  

More Telugu News