Tollywood: సెన్సార్ పూర్తి చేసుకున్న 'పంతం'

  • యూ/ఏ సర్టిఫికెట్‌ పొందిన 'పంతం'
  • గోపీచంద్ సరసన కథానాయికగా మెహ్రీన్
  • వచ్చేనెల 5న భారీస్థాయిలో విడుదల

చక్రి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'పంతం' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. గోపీచంద్ 25వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ కనిపించనుంది. ఇదిలా ఉండగా.. రేపు సాయంత్రం హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కాగా, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

More Telugu News