sensex: మాంచి జోరు మీదున్న స్టాక్ మార్కెట్లు

  • వారాంతంలో ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్న మార్కెట్లు
  • కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు
  • 250 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉత్సాహంగా పరుగులు పెడుతున్నాయి. మార్కెట్లకు ఈ రోజు వారాంతం కావడంతో... ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మధ్యాహ్నం 11.30 గంటల సమయానికి...  సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 35,288కి ఎగబాకింది. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 10,671కి చేరింది. టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ తదితర సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి. క్వాలిటీ, జైన్ ఇరిగేషన్, టెక్ మహీంద్రా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తదితర కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

More Telugu News