railway protection force: రైల్వే భద్రతా దళంలో భారీగా ఎస్ఐ, కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్

  • 1,120 ఎస్ ఐ పోస్టులు, 8,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
  • ఈ నెల 30 వరకు దరఖాస్తులకు గడువు
  • రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదల

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుళ్ల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,120 ఎస్ఐ పోస్టులు, 8,000 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ జరగనుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ పీఎఫ్ ఎస్ఐ పోస్ట్ కు డిగ్రీ చదివిన వారు అర్హులు. కానిస్టేబుల్  పోస్ట్ కు పదో తరగతి, లేదా అందుకు సమానమైన అర్హత ఉండాలి. ఎస్ఐ పోస్ట్ కు 20-25 సంవత్సరాలు, కానిస్టేబుల్ పోస్ట్ కు 18-25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ నెల 30వ తేదీ దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ.

ఎంపికైన ఎస్ఐ అభ్యర్థులకు ప్రారంభ వేతనం కింద రూ.35,400 మరియు ఇతర అలవెన్స్ లు, కానిస్టేబుల్ అభ్యర్థులకు రూ.21,700 మరియు ఇతర అలవెన్స్ లు లభిస్తాయి. దరఖాస్తు చేసుకున్న వారికి సెప్టెంబర్ లో ఆన్ లైన్ పరీక్ష జరుగుతుంది. ఇందులో అర్హత సాధిస్తే తర్వాత శారీరక సామర్థ్య పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు www.indianrailways.gov.in/ వెబ్ సైట్ ను చూసి తెలుసుకోవచ్చు.  

More Telugu News