danam nagender: దానం నాగేందర్ అనుచరులకు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ!

  • కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన దానం
  • ఆ సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన దానం అనుచరులు
  • రూ. 30 వేలు జరిమానా విధించిన జీహెచ్ఎంసీ

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి... ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో దానం నాగేందర్ చేరిన సంగతి తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ లో చేరే సందర్భంగా హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు, బ్యానర్లను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని దానం నివాసం వద్ద నుంచి తెలంగాణ భవన్, బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం వరకు ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, దానం అనుచరులు నాగేంద్ర, మోహన్ రెడ్డిలు నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్లను ఏర్పాటు చేశారంటూ ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున మొత్తం రూ. 30 వేల జరిమానాను జీహెచ్ఎంసీ విధించింది. గతంలో కూడా కేటీఆర్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసిన వారిపై జీహెచ్ఎంసీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

More Telugu News