ప్రధానికి ప్రాణాపాయం... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!
- మోదీ ప్రాణాలు తీసేందుకు విద్రోహశక్తుల ప్రణాళికలు
- మంత్రులు, అధికారులైనా ఎస్పీజీ అనుమతితోనే ఆయన వద్దకు
- కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు
2019లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీజేపీ ప్రధాన ప్రచారకర్తగా మోదీ, దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వారి నుంచి ఆయనకు ప్రమాదం ఉందని, హోమ్ శాఖ అన్ని రాష్ట్రాలకూ పంపిన లేఖలో పేర్కొంది. మోదీ దగ్గరకు ఎవరూ వెళ్లకుండా చూసుకోవాలని, దీన్ని ప్రథమ నిబంధనగా ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్రాల బీజేపీ చీఫ్ లకు కూడా తెలిపింది. ఆయన భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) అనుమతితోనే అధికారులు, నేతలు ఆయన వద్దకు వెళ్లాలని తెలిపింది.