aadi saikumar: రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఛాన్స్ కొట్టేసిన సురభి

  • ఆది హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్ 
  • కథానాయికగా సురభి 
  • వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్  

తెలుగు తెరని పలకరించిన అందమైన కథానాయికలలో సురభి ఒకరు. సురభి చేసింది తక్కువ సినిమాలే అయినా .. వాటిలో విజయాన్ని సాధించినవే ఎక్కువ. సక్సెస్ రేటుతో పాటు యూత్ లో ఈ సుందరికి మంచి క్రేజ్ కూడా వుంది. అయినా ఆశించిన స్థాయిలో ఈ అమ్మాయి అవకాశాలను అందుకోలేకపోతోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

తాజాగా సురభి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్లో చేయడానికి అంగీకరించింది. శ్రీనివాస నాయుడు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఆమె ఆది సాయికుమార్ కు జోడీగా కనిపించనుంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో ఆది సాయికుమార్ సతమతమైపోతున్నాడు. సురభి కూడా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఇద్దరి ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందేమో చూడాలి.       

More Telugu News