Telugudesam: టీడీపీ నేతలు అవినీతిలో పోటీపడుతున్నారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • చంద్రబాబు కుమారుడికి తప్ప ఎవరికీ జాబ్ లేదు
  • సాయం చేసిన మోదీని మోసం చేయాలని బాబు చూస్తున్నారు
  • కడప స్టీల్ ప్లాంట్ విషయమై టీడీపీ డ్రామాలాడుతోంది

టీడీపీ నేతలు అవినీతిలో పోటీపడ్డారే తప్ప, అభివృద్ధిలో కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. శ్రీకాకుళంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా స్థాయి నాయకులతో విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కన్నా మాట్లాడుతూ, జన్మభూమి కమిటీ సభ్యుడి నుంచి మంత్రి వరకూ అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు.

బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారని, బాబు కుమారుడికి తప్ప ఎవరికీ జాబ్ లేదని విమర్శించారు. సాయం చేసిన మోదీని మోసం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని చెప్పిన కన్నా, అన్నం పెట్టిన చేతినే నరకటం బాబు సహజగుణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించారు. ఈ విషయమై టీడీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు.

More Telugu News