Botsa Satyanarayana: మా పార్టీలోకి ఎవరు వచ్చినా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలి: బొత్స

  • విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన బొత్స
  • మంత్రి గంటా మా పార్టీలోకి వస్తున్నారో లేదో నాకు తెలియదు
  • పార్టీ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తాం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య విభేదాలు ఉన్నాయని, మరోవైపు సర్వే పేరుతో తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గంటా శ్రీనివాసరావు మనస్తాపం చెందారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణను మీడియా ఓ ప్రశ్న అడిగింది.

గంటా శ్రీనివాసరావు మీ పార్టీలోకి రానున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు బొత్స స్పందిస్తూ... ఆ విషయం తనకు తెలియదని అన్నారు. పార్టీ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తామని, అయితే, తమ పార్టీలోకి ఎవరు వచ్చినా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని వ్యాఖ్యానించారు.       

More Telugu News