Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ కు ‘స్కోచ్’ అవార్డు

  • గవర్నెన్స్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖకు మరో 3 అవార్డులు
  • ‘పంచాయతీరాజ్’లో టెక్నాలజీ వినియోగంతో మార్పులు 
  • ఇందుకు గాను లోకేశ్ కు స్కోచ్ అవార్డు

ఏపీ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. లోకేశ్ ను స్కోచ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక చేశారు. పంచాయతీరాజ్ శాఖలో టెక్నాలజీ వినియోగం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకు గాను ఈ అవార్డు లభించింది. గవర్నెన్స్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖకు మరో 3 అవార్డులు లభించాయి. ఈ నెల 23న ఢిల్లీలో జరగనున్న స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును లోకేశ్ అందుకోనున్నారు.

More Telugu News