kiara advani: మహేశ్ బాబు ఇంట్లో కైరా అద్వాని సందడి!

  • యూత్ ను ఆకట్టుకున్న కైరా అద్వాని 
  • నమ్రతతో ఏర్పడిన స్నేహం
  • ఆ ఫ్యామిలీతో సందడి చేసిన కైరా      

తెలుగు తెరకి 'భరత్ అనే నేను' సినిమా ద్వారా కైరా అద్వాని పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో యూత్ లో ఆమెకి క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేశ్ బాబు భార్య నమ్రతతో కైరాకు స్నేహం ఏర్పడిందట. ఆ చనువుతోనే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆమె నమ్రతను కలుస్తోంది.

అలా తాజాగా హైదరాబాద్ వచ్చిన ఆమె నమ్రతను కలుసుకుని, ఆ రోజంతా కూడా వాళ్లతో కలిసి సందడి చేసిందట. ఆ సందర్భంలోనే ఆమెతోను .. మహేశ్ కూతురు సితారతోను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక మరో వార్త కూడా ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. నమ్రత సిఫార్స్ కారణంగానే కైరా అద్వానికి చరణ్ .. బోయపాటి సినిమాలోను ఛాన్స్ దొరికిందని చెప్పుకుంటున్నారు. కైరా స్పీడ్ చూసిన వాళ్లు ఇక్కడ ఆమె హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.  

More Telugu News