sushanth reddy: 'ఈ నగరానికి ఏమైంది?' విడుదల తేదీ ఖరారు

  • 'పెళ్లిచూపులు'తో హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ 
  • రెండవ సినిమాగా 'ఈ నగరానికి ఏమైంది?'
  • ఈ నెల 29వ తేదీన విడుదల    

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది?' సినిమా రూపొందింది. నూతన నటీనటులతో ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ రెడ్డి .. విశ్వక్ సేన్ .. వెంకటేశ్ నాయుడు .. అభినవ్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.

ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కథ .. కథనాలు .. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధానబలంగా నిలుస్తాయని అంటున్నారు. తరుణ్ భాస్కర్ తొలిచిత్రమైన 'పెళ్లి చూపులు' ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దాంతో సహజంగానే 'ఈ నగరానికి ఏమైంది' సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతోను తరుణ్ భాస్కర్ సంచలనానికి తెరతీస్తాడేమో చూడాలి.    

More Telugu News