sai dharam tej: మెగా హీరో పారితోషికంగా పైసా కూడా తీసుకోలేదట

  • కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్ యూ'
  • తేజు సరసన నాయికగా అనుపమ 
  • వచ్చేనెల 6వ తేదీన విడుదల      

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేస్తున్నారు. కొంతకాలంగా తేజు వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. అయినా ఆయనతో సినిమా చేయడానికి కేఎస్ రామారావు ముందుకొచ్చారు.

అందువలన ఈ సినిమాకి సాయిధరమ్ తేజ్ పారితోషికం వద్దన్నాడట. షూటింగుకి సంబంధించిన కొన్ని ఖర్చులు మినహా, పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. దాంతో ఈ సినిమా మంచిగా ఆడితే లాభాలలో ఆయనకి వాటా ఇచ్చే ఉద్దేశంతో కేఎస్ రామారావు వున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ కి హిట్ పడటం ఖాయమని కరుణాకరన్ తన సన్నిహితులతో అంటున్నారట.      

More Telugu News