Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తెలుగుతో ఇబ్బంది పడ్డ అనుపమ!
  • షాక్ అవుతారంటున్న సాయి పల్లవి
  • హీరోగా దర్శకుడి తనయుడు 
  • కన్నడలో ఛాన్స్ కొట్టిన శ్రద్దాదాస్

*  మొదట్లో తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డానని చెబుతోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'వచ్చిన కొత్తలో సెట్స్ లో అందరూ తెలుగు మాట్లాడుతుంటే ఇబ్బంది పడేదాన్ని. దాంతో పట్టుబట్టి తెలుగు నేర్చేసుకున్నాను. ఇప్పుడు భాషతో ఏ ఇబ్బందీ లేదు, హ్యాపీగా వుంది' అని చెప్పింది.
*  ప్రస్తుతం చేస్తున్న 'పడిపడి లేచే మనసు చిత్రంలో తన పాత్ర చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని, అలాంటి పాత్రలో అస్సలు తనను ఊహించరని అంటోంది కథానాయిక సాయి పల్లవి. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదలవుతుంది.
*  దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. తండ్రి దర్శకత్వంలో రూపొందే 'ప్రేమెంత పనిచేసే నారాయణ' పేరిట ఈ చిత్రం రూపొందుతోంది.
*  కథానాయిక శ్రద్దా దాస్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో ఇతర భాషలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తాజాగా కన్నడలో ఓ అవకాశాన్ని అందుకుంది. సుదీప్ హీరోగా నటించే 'కోటిగొబ్బ 3' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ అవకాశాన్ని పొందింది.

More Telugu News