gopichand: విజయవాడలో ఆడియో రిలీజ్ .. విశాఖలో ప్రీ రిలీజ్

  • గోపీచంద్ హీరోగా 'పంతం'
  • కథానాయికగా మెహ్రీన్ 
  • వచ్చేనెలలో రిలీజ్      

గోపీచంద్ హీరోగా చక్రి దర్శకత్వంలో 'పంతం' సినిమా రూపొందింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకి గోపీసుందర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

త్వరలోనే ఈ సినిమా ఆడియో వేడుకను విజయవాడలో నిర్వహించనున్నారు. అలాగే ఈ నెలాఖరులో విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 6వ తేదీన గానీ .. లేదంటే ఒకరోజు ముందుగా గాని ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంతకాలంగా సక్సెస్ లు పలకరించకపోవడంతో గోపీచంద్ అభిమానులు నిరాశతో వున్నారు. గోపీచంద్ నుంచి వాళ్లు ఆశిస్తోన్న విజయం ఈ సినిమాతో దొరుకుతుందేమో చూడాలి.       

More Telugu News