YSRCP: ఢిల్లీలో బీజేపీ ఏపీ నేతలతో వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి భేటీ.. వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్‌

  • ఏపీ ప్రభుత్వ అవినీతిపై చర్చలు?
  • గుర్తించిన మీడియా ఛానెల్ 
  • బీజేపీ అగ్రనేతలతోనూ సమావేశం?

ఢిల్లీలో బీజేపీ ఏపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఓ గదిలోకి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో పాటు ఆయన వెళ్లినట్లు మీడియా గుర్తించింది. వారంతా బీజేపీ అగ్రనేతలతోనూ సమావేశం జరిపినట్లు సమాచారం.

టీడీపీ ప్రభుత్వంపై కొంత కాలంగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, నిజాలు తేలాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలపైనే ఢిల్లీలో భేటీ జరుగుతోందని ఓ వార్తా ఛానెల్‌ పేర్కొంది.    

కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను ఏపీ మంత్రి లోకేశ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రహస్య భేటీ ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తూ నాలుగు ఆఫ్షన్లు ఇచ్చి చురకలంటించారు. 1) ఆపరేషన్ గరుడ 2) జగన్ కేసుల మాఫీ 3) తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అమ్మడం 4) పై వాటిల్లో అన్నీ... అంటూ ఎద్దేవా చేశారు.



More Telugu News