mothkpalli: మోత్కుపల్లి నర్సింహులుతో విజయసాయి రెడ్డి భేటీ

  • హైదరాబాద్ లోని మోత్కుపల్లి నివాసానికి వెళ్లిన విజయసాయి
  • పలు విషయాలపై వారు చర్చించుకున్నట్టు సమాచారం
  • మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు?

టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని మోత్కుపల్లి నివాసానికి ఈరోజు విజయసాయిరెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించుకున్నట్టు సమాచారం. మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు ప్రకటించినట్టు సమాచారం.

కాగా, మూడు రోజుల క్రితమే మోత్కుపల్లిని విజయసాయి కలవాలనుకున్న విషయం తెలిసిందే. అయితే, మీడియా కంట పడటంతో మోత్కుపల్లిని కలవకుండానే విజయసాయి వెనుదిరిగారు. ఆ తర్వాత ఇదే విషయమై విజయసాయిని మీడియా ప్రశ్నించగా.. మోత్కుపల్లిని కలవాలని తాను అనుకోలేదని, కలిసేందుకు వెళ్లాననే ప్రచారం చేశారు కనుక కచ్చితంగా మోత్కుపల్లిని కలుస్తానంటూ విజయసాయిరెడ్డి చెప్పుకున్నారు.

More Telugu News