Chiranjeevi: 76 సార్లు రక్తదానం చేసిన రవణం స్వామినాయుడికి మెగా అవార్డు

  • ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అవార్డు
  • తెలంగాణ హోం మంత్రి చేతుల మీదుగా అందుకున్న రవణం
  • మెగా ప్రసంసాపత్రం అందజేత

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారికి అవార్డులు అందించింది. చిరంజీవి యువత అనేక సార్లు రక్తదాన శిబిరాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు, 76 సార్లు రక్తదానం చేసిన రవణం స్వామినాయుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా మెగా అవార్డు, మెగా ప్రసంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మెగా రక్తదాతలందరికి శిరస్సువంచి నమస్కరిస్తున్నామని స్వామి నాయుడు అన్నారు.                  

More Telugu News