vijay devarakonda: విజయ్ దేవరకొండ మూవీలో కొత్తవారికి ఛాన్స్

  • విజయ్ దేవరకొండ హీరోగా 'కామ్రేడ్'
  • కథానాయికగా రష్మిక మందన 
  • త్వరలోనే సెట్స్ పైకి

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'కామ్రేడ్' సినిమా రూపొందనుంది. భరత్ కమ్మా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా రష్మిక మందన కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం కొత్తవారిని తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారు.

అందుకోసం ఈ నెల 16 .. 17 తేదీలలో కాకినాడలో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. నటన పట్ల ఆసక్తి వున్నవారు ఈ రెండు రోజుల్లో కాకినాడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే వున్న 'గాంధీభవన్' లో జరగనున్న ఆడిషన్స్ కి  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు హాజరుకావలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈ సినిమా యూనిట్ వారు ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రష్మిక మందన క్రికెటర్ గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మరో మూడు నాలుగు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో విజయ్ దేవరకొండ వున్నాడు.

More Telugu News