sudheerbabu: తెలుగు తెరపై బయోపిక్ ల జోరు .. పట్టాలెక్కనున్న మరో బయోపిక్

  • సుధీర్ బాబు హీరోగా బయోపిక్ 
  • దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు 
  • సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు  

సుధీర్ బాబు హీరోగా రూపొందిన 'సమ్మోహనం' సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు 'పుల్లెల గోపీచంద్' బయోపిక్ చేయనున్నట్టు తెలుస్తోంది.

సుధీర్ బాబుకి బ్యాడ్మింటన్ లో మంచి ప్రవేశం వుంది. అందువలన ఆయన ఈ బయోపిక్ పై చాలాకాలంగా ఆసక్తిని కనబరుస్తూ వస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు పేరు వినిపించింది. అయితే వివిధ కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైనట్టు చెబుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. త్వరలోనే పూర్తివివరాలు తెలియనున్నాయి. 

More Telugu News