Rithika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మెగా హీరో సరసన రితికాసింగ్ 
  • తాజా షెడ్యూల్ మొదలెడుతున్న చరణ్ 
  • దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం 'అతడే'
  • ఫ్యామిలీతో రవితేజ హాలిడే ట్రిప్  


*  'గురు' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన రితికా సింగ్ త్వరలో సాయి ధరం తేజ్ సరసన నటించనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరం తేజ్ నటించే చిత్రంలో నాయికగా రితికాను తీసుకున్నట్టు సమాచారం.
*  రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ తాజా షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన గత షెడ్యూలును బ్యాంకాక్ లో చేసిన సంగతి విదితమే.
*  ఇటీవల 'మహానటి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన దుల్కర్ సల్మాన్ 'అతడే' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన 'సోలో' చిత్రాన్ని 'అతడే' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. దీనిని ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నారు.
*  హీరో రవితేజ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలసి బ్యాంకాక్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. విశేషం ఏమిటంటే, ఈ ట్రిప్ కి తన పర్శనల్ స్టాఫ్ ని కూడా తీసుకెళ్లాడట.  
 

More Telugu News