siddharamaiah: స్పీకర్ కార్యాలయం సిద్ధరామయ్యకు కేటాయింపు

  • సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధూకు కార్యాలయం కేటాయింపు
  • కర్ణాటకలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్
  • గతంలో 68 లక్షల ఖర్చుతో కార్యాలయం ఆధునికీకరణ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విధానసౌధలో ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. స్పీకర్ రమేష్ కుమార్ కు కార్యాలయంగా ఉన్న దీన్ని సిద్దూకు కుమారస్వామి ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయం ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి పదవి లేకుండా, సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధరామయ్యకు కార్యాలయ్యాన్ని ఎలా కేటాయిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, మాజీ స్పీకర్ కేబీ కోలివాడ్ ఈ కార్యాలయాన్ని వినియోగించిన సమయంలో... రూ. 68 లక్షల వ్యయంతో కార్యాలయాన్ని ఆధునికీకరించారు. 

More Telugu News