nagashourya: నాగశౌర్య సరసన ఇద్దరు కొత్త కథానాయికలు

  • నాగశౌర్య హీరోగా 'నర్తనశాల'
  • దర్శకుడిగా శ్రీనివాస చక్రవర్తి 
  • 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి  

'ఛలో' సినిమాతో నాగశౌర్య హీరోగానూ .. నిర్మాతగాను సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత సినిమా 'నర్తనశాల'ను కూడా ఆయన సొంత బ్యానర్ పైనే చేస్తున్నాడు. కామెడీతో కూడిన ఈ  ప్రేమకథా చిత్రానికి శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా ద్వారా కాశ్మీర పరదేశి .. యామిని భాస్కర్ కథానాయికలుగా తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. కన్నడలో మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందనను 'ఛలో' సినిమా ద్వారా పరిచయం చేసిన నాగశౌర్య, 'నర్తనశాల' ద్వారా ఈ ఇద్దరు కథానాయికలను పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా తమకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఈ ఇద్దరు హీరోయిన్స్ వున్నారు. ఇక నాగశౌర్య కూడా ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో చేరిపోవడం ఖాయమనే ధీమాతో వున్నాడు. వీళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.    

More Telugu News