Amitabh Bachchan: అమితాబ్ విగ్రహం సరసన రజనీ కాంత్ మైనపు బొమ్మ

  • జైపూర్ లోని సహార్ గఢ్ కోట మ్యూజియంలో రజనీ విగ్రహం
  • దీని బరువు 55 కిలోలు, ఎత్తు 5.9 అడుగులు
  • ఈ విగ్రహం తయారీకి శిల్పులు మూడు నెలలు కష్టపడ్డారు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న సహార్ గఢ్ కోట మ్యూజియంలో రజనీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మ్యూజియం డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ విగ్రహం బరువు 55 కిలోలు, ఎత్తు 5.9 అడుగులని చెప్పారు. ఈ మ్యూజియం సందర్శనకు దక్షిణ భారతదేశం నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, టూరిస్ట్ ల ఫీడ్ బ్యాక్ మేరకు రజనీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

ఈ విగ్రహం తయారు చేసేందుకు శిల్పులు వ్యాంగ్ పింగ్, సుశాంత రే మూడు నెలల పాటు కష్టపడ్డారని అన్నారు. ఈ మ్యూజియం సందర్శనకు రావాల్సిందిగా రజనీని త్వరలోనే ఆహ్వానిస్తామని చెప్పారు. త్వరలోనే బాలీవుడ్ అగ్రనటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, ఈ మ్యూజియంలో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ మైనపు విగ్రహాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల సంఖ్య 36.

More Telugu News