rajamouli: రాజమౌళి మూవీ కోసం రెడీ అవుతోన్న భారీ సెట్స్

  • రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ 
  • హీరోలుగా ఎన్టీఆర్ .. చరణ్ 
  • కొనసాగుతోన్న సెట్స్ నిర్మాణం

'బాహుబలి' సినిమా కోసం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లు ఆ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఆ తరువాత ఆ సెట్స్ చూడటానికి జనం ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమాకి సంబంధించిన పనిలో వున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా ఆయన ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం కూడా భారీ సెట్స్ అవసరమవుతున్నాయట. అయితే ఆ సెట్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో కాకుండా హైదరాబాద్ .. గచ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంగా చెప్పుకునే విశాలమైన స్థలంలో వేస్తున్నారని సమాచారం. ఇందుకోసం ఈ సినిమా నిర్మాతలు అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని రెండు సంవత్సరాలపాటు లీజ్ కి తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పర్యవేక్షణలో అక్కడ వివిధ రకాల సెట్స్ నిర్మాణం జరుగుతోందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికలు ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.   

More Telugu News