railway: రైలులో బ్యాగు పోయినందుకు... రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించిన కోర్టు!

  • ప్రయాణ సమయంలో మాయమైన హ్యాండ్ బ్యాగు
  • అందులో రూ.2 లక్షల విలువైనవి ఉంటే... అధిక పరిహారానికి కోర్టు ఆదేశం
  • రిజర్వేషన్ కోచ్ లలోకి ఇతరులు ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత రైల్వేదేనని స్పష్టీకరణ

రైలు ప్రయాణ సమయంలో హ్యాండ్ బ్యాగ్ చోరీకి గురికాగా, బాధితులకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఒకటి తీర్పునిచ్చింది. గతేడాది మే నెలలో శైలేష్ భాయ్, మీనాబెన్ భగత్ జంట జమ్ముతావి ఎక్స్ ప్రెస్ లో 2టైర్ ఏసీలో ప్రయాణించారు. మధుర, ఢిల్లీ స్టేషన్ల మధ్య వీరి హ్యాండ్ బ్యాగు చోరీకి గురైంది. దీనిపై వారు రైల్వేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవడంతో, జామ్ నగర్ లోని వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. బ్యాగులో రూ.2 లక్షల విలువైన వస్తువులు వున్నాయని వాదించారు.  

అయితే, ప్రయాణికుల వాదనతో రైల్వే విభేదించింది. వారు క్యారీ చేసిన లగేజీకి బుకింగ్ లేదని, ఎటువంటి చార్జీలు చెల్లించలేదు కనుక పోయిన వాటికి తమ బాధ్యత లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ వాదనను వినియోగదారుల కోర్టు అంగీకరించలేదు. రైల్వే రిజర్వేషన్ కోచ్ లలోకి రిజర్వేషన్ లేని వారు ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత టీటీపైనే ఉందని స్పష్టం చేస్తూ, రైల్వేస్ నిర్లక్ష్యానికి బాధితుడికి రూ.5 లక్షలు చెల్లించాలని ఫోరం ఆదేశించింది.

More Telugu News