kcr: ఇలాగైతే ఎవరూ కాపాడలేరు.. 39 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్

  • ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే రిపోర్ట్స్
  • ఉత్తర తెలంగాణలో దారుణంగా ఉన్న పలువురు సీనియర్ల పరిస్థితి
  • పనితీరు మెరుగుపరుచుకోకపోతే.. ఎవరూ కాపాడలేరన్న కేసీఆర్

39 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరిలో చాలా మందికి టికెట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... వీరిలో పలువురికి ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలకు వారి చేతే చెప్పించారు.

పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా కొందరు సీనియర్ల పరిస్థితి దారుణంగా ఉందని సమాచారం. వివిధ సర్వేల ద్వారా కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెప్పించుకున్నారు. పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని... వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలాగే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

More Telugu News