chaitu: సీక్వెల్ దిశగా 'ఏ మాయ చేశావే?'

  • చైతూకి హిట్ ఇచ్చేసింది 
  • సమంతను నిలబెట్టేసింది 
  • ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది  

తెలుగు తెరను పలకరించిన అందమైన ప్రేమకథా చిత్రాల సరసన 'ఏ మాయ చేసావే' కూడా కనిపిస్తుంది. నాగచైతన్య .. సమంత కాంబినేషన్లో 2010లో వచ్చిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. భారీవసూళ్లను సాధిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు చైతూకు .. అటు సమంతకు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి గౌతమ్ మీనన్ రెడీ అవుతున్నాడనేది తాజా సమాచారం. ఇదే సినిమాను ఆయన తమిళంలో శింబు .. త్రిష జంటగా చేశాడు. తమిళ సీక్వెల్ కి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక తెలుగు సీక్వెల్ కి చైతూ ఓకే చెప్పాల్సి ఉందని సమాచారం. ఇక కథానాయికల విషయంలోను స్పష్టత రావలసి వుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ ప్రాజెక్టు ఆలస్యమైతే, 'ఎంతవాడు' సీక్వెల్ తో రంగంలోకి దిగాలనే ఆలోచనలోను గౌతమ్ మీనన్ ఉన్నాడనేది కోలీవుడ్ టాక్. 

More Telugu News