saidharam tej: చిరూ ముఖ్య అతిథిగా 'తేజ్ ఐ లవ్ యూ' ఆడియో ఫంక్షన్

  • కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్ యూ'
  • తేజు సరసన అనుపమ పరమేశ్వరన్ 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్

కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక ప్రేమకథా చిత్రం చేస్తున్నాడు. 'తేజ్ ఐ లవ్ యూ' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను జరపనున్నారు. అంగరంగవైభవంగా జరగనున్న ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కానున్నారు. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బాణీలు ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తోన్న సాయిధరమ్ తేజ్ కి, ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News