Allu Arjun: టాలీవుడ్‌ అగ్ర దర్శకులంతా ఒక్కచోట చేరడంపై అల్లు అర్జున్‌ హర్షం

  • సోషల్ మీడియాలో దర్శకుల ఫొటోలు హల్‌చల్‌
  • దర్శకుల కోసం సుకుమార్‌, వంశీ విందు ఇచ్చారన్న బన్నీ 
  • చాలా లవ్లీగా ఉందని ట్వీట్
  • వారందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం బాగుందని వ్యాఖ్య

తొమ్మిది మంది టాలీవుడ్ దర్శకులు ఒకే ఫ్రేమ్‌లో కనపడుతోన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. రాజమౌళి, వంశీ పైడిపల్లితో పాటు పలువురు దర్శకులు ఈ ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. వారిద్దరితో పాటు ఈ ఫొటోల్లో సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా ఉన్నారు.       సుకుమార్‌, వంశీ ఇచ్చిన విందులో పాల్గొన్న సదరు దర్శకులందరూ ఒకేచోట కూర్చుని భోజనం చేసి ముచ్చటించుకున్నారు. ఈ ఫొటోలు టాలీవుడ్‌ హీరోలను కూడా అలరిస్తున్నాయి. తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా వారి ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశాడు. దర్శకుల కోసం సుకుమార్‌, వంశీ విందు ఏర్పాటు చేయడం చాలా లవ్లీగా ఉందని పేర్కొన్నాడు. వారందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం చాలా బాగుందని అన్నాడు.            

More Telugu News