venkatesh: గ్రామీణ నేపథ్యంలో 'వెంకీ మామా' .. దర్శకుడిగా బాబీ!

  • మల్టీ స్టారర్ కి బాబీ సన్నాహాలు 
  • వెంకీ సరసన హ్యూమా ఖురేషి 
  • చైతూ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్    

'జై లవ కుశ' హిట్ తరువాత కొంత సమయం తీసుకుని దర్శకుడు బాబీ మంచి ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం వెంకటేశ్ .. నాగచైతన్యలను హీరోలుగా ఎంచుకున్నాడు. ఈ ఇద్దరూ బయట మేనమామ .. మేనల్లుడు అనే సంగతి తెలిసిందే. బాబీ సినిమాలోనూ ఈ ఇద్దరూ మేనమామ .. మేనల్లుడు పాత్రలనే పోషించనుండటం విశేషం. అందువల్లనే ఈ సినిమాకి 'వెంకీ మామా' అనే టైటిల్ ను ఖరారు చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారట. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో రూపొందనుండటం మరో విశేషం. ఎక్కువభాగం షూటింగ్ తమిళనాడులోని 'కారైకూడి'లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకీ సరసన కథానాయికగా హ్యూమా ఖురేషి .. చైతూ జోడీగా రకుల్ ప్రీత్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

More Telugu News